రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 8 : రాజస్థాన్ రాజధాని జైపూర్లో రాష్ట్రానికి చెందిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ల, వైస్ చైర్మన్ల బృందం ఈరోజు పర్యటించింది. ఈ బృందానికి అక్కడి అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి అక్కడ జరుగుతున్న అభివృద్ధి, ప్రాజక్ట్ పనులను వివరించి క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును చూపించారు. రూ. 150 కోట్లతో జైపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జైపూర్-ఆగ్రా హైవేలో నిర్మించిన టన్నెల్ ప్రాజక్ట్ను ఈ బృందం పరిశీలించిందని ఈ బృందంలో సభ్యుడైన గుడా చైర్మన్ గన్ని కృష్ణ తెలిపారు.